Ration Biyyam: రేషన్ బియ్యం దందా: బస్తా రూ.1500! ఏపీలో కొత్త మాఫియా గుట్టు రట్టు..

By Hari Prasad

Updated On:

Follow Us
Ration Biyyam mafia in AP
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

రేషన్ బియ్యం దందా: బస్తా రూ.1500! ఏపీలో కొత్త మాఫియా గుట్టు రట్టు.. | Ration Biyyam mafia in AP

ఆంధ్రప్రదేశ్లో రేషన్ బియ్యం అక్రమ రవాణా మరోసారి వెలుగులోకి వచ్చింది. పేదలకు పంపిణీ చేయాల్సిన బియ్యాన్ని కొందరు అక్రమార్కులు లక్షలాది రూపాయల వ్యాపారంగా మార్చేసుకున్నారు. ఒకప్పుడు కేవలం సరిహద్దు రాష్ట్రాలకు తరలించే దందా.. ఇప్పుడు కొత్త రూపు సంతరించుకుంది. రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి, పాలిష్ పట్టించి, మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. ఈ కొత్త ‘బిజినెస్’ వెనుక జరుగుతున్న చీకటి కథ ఇప్పుడు బయటపడింది.


ప్రకాశం జిల్లాలో లారీ బోల్తా.. బయటపడ్డ రహస్యం

ఇటీవల ప్రకాశం జిల్లాలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం ఈ రేషన్ బియ్యం దందాకు సంబంధించిన రహస్యాలను బయటపెట్టింది. పల్నాడు నుంచి చెన్నైకి వెళ్తున్న ఒక లారీ మద్దిపాడు దగ్గర బోల్తా పడింది. అందులో ఉన్న బియ్యం బస్తాలు కింద పడటంతో స్థానికులు ఆరా తీశారు. అప్పుడు తెలిసిందేమిటంటే.. అవి సాధారణ బియ్యం కాదు, రీసైక్లింగ్ చేసిన రేషన్ బియ్యం. ఈ వ్యవహారంపై పోలీసులు, పౌరసరఫరాల శాఖ అధికారులు విచారణ చేయగా పల్నాడు ప్రాంతంలో పెద్ద నెట్‌వర్క్ నడుస్తున్నట్లు తేలింది.


ఎలా జరుగుతోంది ఈ దందా?

రేషన్ బియ్యం దందా చాలా తెలివిగా జరుగుతోంది. దళారులు ముందుగా రేషన్ కార్డు ఉన్నవారి దగ్గర నుంచి కిలో బియ్యాన్ని కేవలం రూ. 12కు కొనుగోలు చేస్తారు. ఇలా సేకరించిన బియ్యాన్ని రైస్ మిల్లులకు తరలిస్తారు. అక్కడ వాటిని ఒకటి లేదా రెండు సార్లు పాలిష్ చేసి, సన్న బియ్యంగా మార్చేస్తారు. ఆ తర్వాత, 25 కిలోల బస్తాల్లో కొత్త పేర్లతో ప్యాక్ చేస్తారు. ఈ ఒక్క బస్తాను మార్కెట్లో ఏకంగా రూ. 1500కు అమ్ముకుంటున్నారు. అంటే, కొన్న ధరకు దాదాపు 10 రెట్లు అధికంగా లాభం పొందుతున్నారు. ఈ రేషన్ బియ్యం మాఫియా కోట్లలో లాభాలు ఆర్జిస్తోంది.


విదేశాలకు కూడా అక్రమ రవాణా?

ఈ సన్న బియ్యాన్ని ముందుగా చెన్నైకి తరలిస్తున్నారు. అక్కడి నుంచి విదేశాలకు కూడా అక్రమ రవాణా జరుగుతోందని ప్రచారం సాగుతోంది. ఈ వ్యవహారంలో ఉన్న రైస్ మిల్లులు, దళారుల గురించి అధికారులు ఆరా తీస్తున్నారు. గతంలో కూడా పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా దాడులు చేసి ఈ రేషన్ బియ్యం మాఫియాను అదుపులోకి తీసుకున్నారు. కొన్ని రైస్ మిల్లులను సీజ్ చేశారు. కానీ కొద్ది రోజులు గడిచాక మళ్ళీ ఈ అక్రమ వ్యాపారం యథావిధిగా మొదలైంది. అధికారులు నిఘా పెంచినా, కొన్నిచోట్ల వారి కళ్ళుగప్పి ఈ దందా కొనసాగుతోందని అంటున్నారు. పేదల కడుపు కొడుతున్న ఈ అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఈ దందా ఆగేలా లేదు.

🚀 Join Telugu Mitra Channels
Telegram

Telegram

98,000+ Members

JOIN NOW
WhatsApp

WhatsApp

47,000+ Members

JOIN NOW
Hari Prasad
Hari Prasad

Tech enthusiast sharing news, jobs & schemes for the Telugu community.

Read More →

Leave a Comment

WhatsApp Icon Join WhatsApp